సినిమా నిర్మాణం అనేది మామూలు విషయం కాదు. నీళ్లలా డబ్బు ను పోస్తూ ఉండాలి అప్పుడు గానీ అనుకున్న అవుట్ ఫుట్ రాదు. ఇక స్టార్ హీరోలా సినిమా అంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి లేకపోతే రిజల్ట్ తేడా కొడుతోంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ను బాలయ్య తన స్వీయ నిర్మాణం లో చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కు నటీ నటుల పారితోషకాల రూపం లో తడిసి మోపిడైంది. దీనితో బాలకృష్ణ ఆలోచనలో పడి నట్టున్నాడు.
బాలీవుడ్ స్టార్లు….టెక్నీషియన్లను క్రిష్ రంగంలోకి దింపి తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదంటూ..కో్ట్ల రూపాయాలను ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నటీనటుల పారితోషికాలే పదికొట్లు దాటినట్లు సమాచారం. బసవతారకం రోల్ పోషిస్తోన్న విద్యాబాలన్ కు రెండు కోట్లు పారితోషికం ఇచ్చారుట. ముందుగా కోటి రూపాయల్లో విద్యను మాట్లాడలనుకున్నారుట. కానీ ఆమె డిమాండ్ చూసి కోటిన్నర ఆఫర్ చేశారుట. అందుకు అంగీకరించకపోవడంతో మరో యాభై లక్షలు కలిపి రెండు కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మిగతా అన్ని పాత్రలకు కలిపి ఎనిమిది కోట్ల వరకూ ఖర్చు అవుతుందట. ఒక్క పారితోషికాలే ఈ రేంజ్ లో ఉన్నాయంటే…సినిమా షూటిగ్ కు ఖర్చు కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమా నిర్మాణంలో మూడవ వ్యక్తిని కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఖర్చు మరీ ఆకాశాన్నంటుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే బయట వ్యక్తిని కాకుండా తనకు తెలిసిన ఓ దగ్గర బంధువును పార్టనర్ గా జాయిన్ చేసుకుంటున్నట్లు సమాచారం.