ఈ సంవత్సరం సమ్మర్ కు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ రికార్డులను క్రియేట్ చేసిన ‘భరత్ అనే నేను’ మూవీతో దర్శకుడు కొరటాల శివ నష్టపోయాడు అంటూ నిన్న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించింది. ఈసినిమా నిర్మాత డివివి దానయ్య దర్శకుడు కొరటాలకు సంబంధించిన పారితోషికం ఇంకా పూర్తిగా సెటిల్ చేయలేదనీ ఈవిషయంలో కొరటాల ఎన్నిసార్లు అడిగినా దానయ్య స్పందించడంలేదు అంటూ ఒక షాకింగ్ న్యూస్ ను బయటపెట్టింది.
Again Koratala Siva Responds On Ap Special Status - Sakshi
అంతేకాదు ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వాని కూడ పారితోషికం దానయ్య పూర్తిగా ఇవ్వలేదు అంటూ ఆకథనంలో పేర్కొంది. ఈ వార్తను ప్రచురిచింది ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక కావడంతో ప్రస్తుతం చరణ్ తో ఒక భారీ సినిమాను అదేవిధంగా రాజమౌళి దర్సకత్వంలో చరణ్ జూనియర్లతో ఒక భారీ మల్టీ స్టారర్ లను తీస్తున్న దానయ్యకు ఏమైంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. 
Kiara Advani is the new sensation in Tollywood
అయితే జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన నిర్మాత దానయ్య వెంటనే రంగంలోకి దిగి ఈ వార్తలను ఖండించాడు. ‘భరత్ అనే నేను’ మూవీ బిజినెస్ డీల్స్ అన్నీ కొరటాల చేతుల మీదుగా జరిగినప్పుడు కొరటాల పారితోషికం ఎందుకు ఆగుతుంది అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు దానయ్య. 

అదేవిధంగా కియారా అద్వాని తన తదుపరి సినిమాలో కూడ నటిస్తున్న నేపధ్యంలో ఆమెకు పారితోషికం బాకీ ఉంటే కియారా తన బ్యానర్ లో నటించదు కదా అని అడుగుతున్నాడు దానయ్య. అంతేకాదు ఎవరో కావాలని తన పై బురద జల్లడానికి ఈవార్తలను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అంటూ ఈ మీడియా కథనాలకు చెక్ పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేసాడు. అయితే ఒక జాతీయ మీడియా కేవలం దానయ్యను టార్గెట్ చేస్తూ ఇలా ఎందుకు షాకింగ్ కథనాన్ని ప్రచురించింది అన్నది సమాధానం లేని ప్రశ్న.



మరింత సమాచారం తెలుసుకోండి: