తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కామెడియన్లు హీరోలుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు రాజబాబు, పద్మనాభం లు కమెడియన్లు గా నటిస్తూనే హీరోలుగా కొన్ని చిత్రాల్లో నటించారు. తర్వాత బ్రహ్మానందం, ఆలీ ఈ బాటలోనే నడిచారు. తాజాగా సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గా షకలక శంకర్ కూడా ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మారారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పేరడీ డైలాగ్స్ తో పాపులారిటీ సంపాదించిన కమెడియన్ ఫృథ్వి ఆ మద్య ఓ సినిమాలో హీరోగా నటించాడు.
తాజాగా ఫృథ్వి హీరోగా నూతన దర్శకుడు కే వి హరీష్ తెరకెక్కిస్తున్న చిత్రం’మై డియర్ మార్తాండం’.
30 రోజుల్లో లాయర్ అయ్యి కోర్టులో కేసులను ఎలగెలిపించాడనే కథ తో తెరకెక్కుతుంది. లాయర్ గెటప్ లో ఫృథ్వి తన కామెడీ తో అలరించనున్నాడు. ఈ మద్య ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి ఫృథ్వి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆ మద్య జగన్ వెంట జండా పట్టుకొని కొంత దూరం కూడా పాదయాత్ర చేశారు.
‘ మై డియర్ మార్తాండం’ టీజర్ ను లాంచ్ చేయనున్నారు వైసీపీ అధినేత ఆంధ్రప్రేదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మజిన్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.