తెలుగు ఇండస్ట్రీలో స్టాలిన్, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి,బుజ్జిగాడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్న ఈ అమ్మడు ఇప్పటికీ గ్లామర్ మెయింటేన్ చేస్తుంది. తాజాగా త్రిష నటించిన ‘మోహిని’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘నాయకి’గా కథానాయిక ప్రాధాన్యమున్న హారర్ కామెడీ జోనర్ చిత్రంలో నటించి మెప్పించారు.
ఇప్పుడు మరోసారి భయపెట్టేందుకు సిద్ధం అంటున్నారామె. త్రిష కీలక పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘మోహిని’. ఆర్. మాదేష్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జులై 27న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఉత్కంఠంగా ఉంది.
‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం’ అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం భయం కల్పించే విధంగా సాగింది. ఇక సినిమా విషయానికి వస్తే..మోహిని ఎవరు..?ఆమెను ఎవరు చంపారు..ప్రేతాత్మగా ఎలా మారి పగ తీర్చుకుంది అన్నదే కాన్సెప్ట్. ప్రిన్స్ పిక్చర్స్, శ్రీలక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై ఎస్.లక్ష్మణ్కుమార్, శ్రీనివాసరావు, కరణం మధులతలు నిర్మిస్తున్నారు.