యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కలిసి చేస్తున్న అరవింద సమేత సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ భారీ రేంజ్ లో జరుగుతుంది.


ఆంధ్రాలో ఇప్పటికే ఈ సినిమాకు 40 కోట్ల ఆఫర్ కోట్ చేయగా నైజాంలో 20 కోట్లకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సీడెడ్ లో కూడా 10 కోట్ల పైనే బిజినెస్ చేసిందట. ఇక ఓవర్సీస్ లో అయితే 12 కోట్లకు బేరం కుదిరింది. ఎలా లేదన్నా ఇప్పటికే 80 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 


ఫస్ట్ లుక్ తోనే ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తే ఇక టీజర్, ట్రైలర్ తర్వాత సినిమా మిగిలిన ఏరియాల బిజినెస్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, మళయాలంలో కూడా ఈ సినిమా అదిరిపోయే బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ కెరియర్ లోనే ఈ సినిమా హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే సినిమాగా కనిపిస్తుంది.


ప్రీ రిలీజ్ బిజినెస్ కు తగినట్టుగా సినిమా కూడా అంచనాలను అందుకుంటే మాత్రం లెక్కకు మించి వసూళ్లు రాబట్టడం పక్కా అని చెప్పొచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో చాలా రోజుల తర్వాత చేతితో కత్తి పట్టిన తారక్ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అది తెలుసుకోవాలంటే అక్టోబర్ 10 దాకా వెయిట్ చేయాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: