ప్రస్తుతం రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది.  బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు రవితేజ.  ఈ సినిమాలో అంధుడిగా నటించి తన మాస్ మార్క్ తో పాటు తన స్టామినా కూడా నిరూపించుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు..నేల టిక్కెట్ సినిమాలు బాగా దెబ్బతీశాయి. 
Related image
అసలే ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు మరో దెబ్బ పడినట్లు టాలీవుడ్ వర్గాలు గుస గుస. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'  షూటింగ్ పూర్తయిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా ప్లాన్ చేశారు.  తమిళంలో విజయ్ హిట్ కొట్టిన 'తెరి' సినిమా నుంచి మూలకథను తీసుకుని ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టును ఆపేసినట్టుగా తెలుస్తోంది. 
Image result for amar akbar anthony raviteja
రవితేజ నటించిన మూడు సినిమాల్లో ఒక్క రాజాది గ్రేట్ తప్ప మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.  దాంతో మార్కట్ లో మనోడి క్రేజ్ కాస్త తగ్గినట్లు కనిపించడంతో మైత్రీ మూవీ మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అమర్ అక్బర్ ఆంటోని' రిజల్ట్ చూసుకుని అప్పుడు రెండవ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళదామని అలా దానిని హోల్డ్ లో పెట్టేశారట. ఆ సినిమా హిట్ అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది .. లేదంటే లేదన్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: