మెగా అనే ట్యాగ్ తో కుర్ర హీరోలు టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తూనే  ఉన్నారు. ఈ మెగా వారసత్వ నటనా ప్రవాహం ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో ఫ్యాన్స్ కి సైతం అర్థం కావడం తల పగల కొట్టుకుంటున్నారు. కాకపోతే ఎంత బ్యాక్ గ్రౌండ్, డబ్బులు ఉన్నా ఇక్కడ భవిష్యత్తుని నిర్దేశించేది టాలెంట్ ప్లస్ సక్సెస్ కాబట్టి అవి ఉన్న వాళ్ళు e సపోర్టు లేకపోయినా, దూసుకుపోతూనే ఉన్నారు. లేని వాళ్ళు బ్రేక్ కోసం తంటాలు పడుతున్నారు.


ఇటీవలే మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత తో లాంచ్ అవ్వడం చూసాం. కనీస స్థాయిలో ఆడుతుందేమో అన్న అంచనాలతో వచ్చిన విజేత అందులో పావలా భాగం కూడా అందుకోలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి నష్టం తప్పదని కూడా ట్రేడ్ పక్కగా తేల్చేసింది. ఇదిలా ఉండగా మరో మెగా హీరోకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తాజా అప్ డేట్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ అవి ఈ ఏడాది ఒక కొలిక్కి వస్తున్నట్టు సమాచారం.


నిజానికి కళ్యాణ్ దేవ్ తర్వాత వైష్ణవ్ దేవ్ ని కూడా తానే పరిచయం చేయలని సాయి కొర్రపాటి అనుకున్నారట. కానీ విజేత ఫలితం చూసాక రిస్క్ చేయటం ఎందుకని డ్రాప్ అయినట్టు ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు ఇది నేల టికెట్టు నిర్మాత రామ్ తాళ్ళూరి చేతిలోకి వెళ్లినట్టు తెలిసింది. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి టిపికల్ సబ్జెక్టు తో విమర్శకులను సైతం మెప్పించిన దర్శకుడు సాగర్ చంద్ర దీనికి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. తెరకు పరిచయం కావాలని వైష్ణవ్ తేజ్ ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఉన్నాడు. షూటింగ్ ఎప్పుడు మొదలుకావచ్చు అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఒకపక్క అన్నయ్య వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న తరుణంలో తమ్ముడు ఎంట్రీ ఇవ్వడం విశేషమే. ఈ తరానికి మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ దేవ్ దే లాస్ట్ ఎంట్రీ నా లేక ఇంకా ఎవరైనా బాలన్స్ ఉన్నారా అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరకటం కష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి: