ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్లు, బయో పిక్ ల తీరు టాలీవుడ్ లో తారా స్టాయికి చేరుకుంది. అయితే మల్టీ స్టారర్ లేదంటే బయో పిక్ అదీ మళ్ళీ చిన్న చిన్న సినిమాలు కూడా కాదండోయ్ అన్నీ పెద్ద సినిమాలే పెద్ద నటులే, అయితే ఇటీవల మరో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఇటీవల‘సమ్మోహనం’ చిత్రం తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు అని తెలిసింది.
ఇక తెలిసిందే గా మల్టీ స్టారర్ అంటే కచ్చితంగా ఇద్దరు పెద్ద హీరోలనే పెడతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్లో హీరోలుగా ఎవరు నటిస్తారని అభిమానులలో అనేక అనుమానాలు తలెత్తగా, యువ హీరోలు శర్వానంద్, నాని నటిస్తారని చిత్ర వర్గాల నుండి సమాచారం బయటకి పొక్కింది. కానీ దిల్ రాజు టీం ఈ విషయాన్ని మాత్రం అఫీషియల్ గా బయటకి చెప్పకపోయినా కూడా, దీనికి సంబంధించిన క్లారిటీ త్వరలోనే రానుంది.
నాని ప్రస్తుతం నాగ్తో దేవదాస్ అనే మల్టీ స్టారర్ చిత్రం చేస్తూ బిసీగా ఉండగా ,శర్వానంద్.. నరేష్తో కలిసి గమ్యం, నువ్వా నేనా వంటి మల్టీ స్టారర్ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. మరి తాజా కాంబినేషన్పై ఆసక్తి నెలకొంది. యాక్షన్ థ్రిల్లర్గా ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ని ఇంద్రగంటి తెరకెక్కించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగులో నాగార్జున-నాని కాంబినేషన్లో దేవదాస్ అనే మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుండగా, వెంకీ- వరుణ్తేజ్ కలిసి ఎఫ్2 అనే చిత్రాన్ని చేస్తున్నారు. బాబీ కూడా వెంకీ- నాగ చైతన్య కాంబోలో ఓ మల్టీ స్టారర్ రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
ఇక మహేష్- అల్లరి నరేష్ కాంబోలో ఓ మల్టీ స్టారర్ మూవీ, నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కాంబినేషన్లో వీర భోగ వసంత రాయలు అనే చిత్రాలు ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్నాయి. త్వరలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కించనున్నాడు