ధ్రువ తర్వాత రాం చరణ్ మళ్లీ ఫాం లోకి వచ్చినట్టు కనిపించగా.. రంగస్థలం తర్వాత రాం చరణ్ రికార్డులన్ని తనవే అంటూ మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి మెగా పవర్ స్టార్ స్టామీఅ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు మన చిరు తనయుడు.


సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రికార్డుల చెడుగుడు ఆడేశాడు రాం చరణ్. సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు.


డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్ అనే నేను భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్టుకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. ఊర మాస్ సినిమాలను డైరెక్ట్ చేసి స్టార్ హీరోల అభిమానులు ఫుల్ ఖుషి అయ్యేలా చేసే బోయపాటి మొదటిసారి రాం చరణ్ తో సినిమా చేస్తున్నాడు.


యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా అనుకున్న విధంగా పూర్తయితే సంక్రాంతి బరిలో జనవరి 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎన్.టి.ఆర్ సినిమాతో పోటీపడుతున్న చరణ్ ఏ రేంజ్ ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: