గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..హీరోయిన్లు కావాలని వచ్చిన అమ్మాయిలతో ఇండస్ట్రీలో చిన్న నుంచి పెద్ద వరకు దారుణంగా వాడుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుంది. అందే కాదు దీనిపై పెద్ద ఉద్యమమే చేసింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె కొన్ని సమస్యల్లో పడిపోవడం ప్రస్తుతం ఇంటి నుంచి సోషల్ మాద్యమాల ద్వారా సెలబ్రెటీలను విమర్శిస్తూ వస్తుంది. కోలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకులు, హీరోలపై శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కొందరు సెలబ్రిటీల పేర్లను బయటపెట్టి వారి చీకటి కోణాలను కూడా బయటి ప్రపంచానికి తెలియజేస్తానని శ్రీరెడ్డి హెచ్చరించడంతో కోలీవుడ్లో కలకలం మొదలైంది. రీసెంట్ గా ప్రముఖ తమిళ దర్శకుడు, నటి ఖుష్బు భర్త సుందర్.సి తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి లోబరుచుకున్నారంటూ ఇటీవల శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.
దీనిపై స్పందించిన సుందర్.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే..హీరో విశాల్ తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఆరోపించింది. ఇది మరింత సంచలనానికి కారణమైంది. అయితే తాజాగా శ్రీరెడ్డి ఓ టీవీ షోలో విశాల్కు క్షమాపణలు చెప్పింది. `సారీ విశాల్ గారూ. హీరోయిన్లకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే స్థానంలో మీరు ఉన్నారు. మీ వల్లే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంద`ని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.