పూజా హెగ్డే ఈ హీరోయిన్ ఇప్పడూ తెలుగు లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్  చెప్పొచ్చు. వరుసగా టాప్ హీరోలా సరసన నటిస్తూ చాలా బిజీ  గా ఉంది. ఇప్పటికే టాప్ హీరోలయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. రంగ స్థలం లో జిగేలు రాణి ఐటెం సాంగ్ లో నటించి మంచి పేరు సంపాదించింది. దీనితో ఈ అమ్మడుకి అవకాశాల వెల్లువ ఇంకా ఎక్కువైందని చెప్పాలి. అయితే ఈ భామ కుర్ర హీరోలతో కూడా సై అంటుంది. 

Image result for puja hegde
ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ స‌ర‌స‌న 'సాక్ష్యం' చిత్రంలో న‌టించింది. ఈ సినిమాకు పూజా భారీ పారితోషికం అందుకుంద‌న్న ప్ర‌చారం సాగింది. అడిగినంతా ఇస్తే కుర్ర‌హీరోల‌తో కూడా నటించేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ అగ్ర‌హీరోలు ఎన్టీఆర్‌, మ‌హేష్ సినిమాల‌తో బిజీగా ఉన్న పూజా త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌స‌న "జిల్" రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నుంది. పెద్ద హీరోల సంగతేమోగానీ, కుర్రహీరోల‌కు అయితే కోటి నుంచి కోటిన్న‌ర రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట‌. 

Image result for puja hegde 

అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రానికి ఈ అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ యేడాది మార్చి నెలలో వచ్చిన 'రంగ‌స్థ‌లం'లో ఐదు నిమిషాల ఐటెమ్ పాట‌కు రూ.50 ల‌క్ష‌లు అందుకున్నట్టు సమాచారం. దీనితో కుర్ర హీరోలంతా ఈ హీరోయిన్ కావాలని అడిగి మరీ ఒకే చేయించుకుంటున్నారంటా..! దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలన్న సామెత గా ఈ హీరోయిన్ కూడా ఎక్కడ తగ్గడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: