యువనటి, పలు తమిళ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది.తమిళనాట పలు టీవీ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించిన ప్రియాంక బుధవారం నాడు తమిళనాడులోని వలసరవక్కాంలోని ఆమె గృహంలో సీలింగ్కి ఉరి వేసుకొని బలన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే కుటుంబ విభేదాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మూడేళ్ళ క్రితం అరుణ్ బాల అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె మూడు నెలలుగా భర్తకి దూరంగా ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ప్రియాంక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రియాంక సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ‘వంశం’ అనే సీరియల్తో బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్లో నటిస్తోంది ప్రియాంక. ఆమె మృతితో కోలీవుడ్లో విషాదం నెలకొంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ప్రియాంక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.