అవును హాట్ యాంకర్ అనసూయకు మరోసారి కోపం వచ్చింది..ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడంటూ సోషల్ మాద్యంలో ఓ వీడియో పోస్ట్ చేసి రచ్చ చేసింది.  ఎప్పుడూ సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా ఓ వ్యక్తిని దారుణంగా తిట్టి ఆరబోసింది.  ఓ వ్యక్తి బండారాన్ని ట్విట్టర్ సాక్షిగా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడిది వైరల్ గా మారింది.  కాగా, . అనసూయ చేసిన పనికి కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఓవరాక్షన్ చేస్తున్నావంటూ మండిపడుతున్నారు.
Image result for anasuya
ఆ కామెంట్స్ కి అనసూయ కూడా సీరియస్ గానే కౌంటర్లు ఇస్తోంది. ఇలా అనసూయ కామెంట్స్ - నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం  సాయంత్రం అనుసూయ ఇంటికి వెళుతుండగా.. ఓ వ్యక్తి వీడియోలు చూస్తూ కారు నడుపుతూ కనిపించాడు. దీన్ని ఆమె తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇలా నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడింది.  రోడ్డుపై ఇంత నిర్లక్ష్యంగా బండ్లు నడిపే వారినికి ఎవరూ క్షమించకండి..వీరి వల్ల ఎన్నో జీవితాలు రోడ్డు పాలవుతాయని చాలా సీరియస్ అయ్యింది.  

Image result for anasuya

ఇలాంటి వారిని వదలద్దు అంటూ పోలీసులకు షేర్ చేసి ట్వీట్ చేసింది. అయితే అనసూయ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..నీకు అంత బుద్ది ఉంటే..దిగి అతన్ని నాలుగు తిట్లు అక్కడే తిట్టొచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు. ‘అప్పట్లో ఓ పిల్లాడికి ఇలా చెబతే చాలా పెద్ద రచ్చ చేశారు. మేం కెమెరా ముందే నటిస్తామండి.. బయట సాధారణ జనాలమే..’ గుర్తించండి అంటూ అనసూయ వాపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: