మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమాలో రైతులకు గురించి మంచి సందేశంతో పాటు చిరు మాస్ ఎలిమెంట్స్ కూడా బాగా చూపించారు.  దాంతో ‘ఖైదీ నెంబర్ 150’రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేసింది.  ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.  అయితే ఈ మద్య స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన లోకేషన్లు లీక్ అవుతున్న విషయం తెలిసిందే.
Image result for seaira narasimha reddy
చిత్ర యూనిట్ ఎంత సీక్రెట్ గా ఉంచాలానుకున్నా కొన్ని ఫోటోలు లీక్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మద్య ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.  అయితే నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఎలా ఉంటారో అన్న విషయం లీక్ కావడంతో చిత్ర యూనిట్ గందరగోళంలో పడ్డారు. కాకపోతే ఆ ఫోటోలు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  తాజాగా  మరో పిక్ మెగా ఫాన్స్ కు కునుకుని దూరం చేస్తోంది.
Related image
అలా అని ఇందులో చిరునో లేక ఇంకెవరో ఉన్నారని కాదు. రత్నవేలు కెమెరా కన్నుతో అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టి చేసి చీకటి తెరలలో గుర్రాల మీద జనాలు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇందులో చిరంజీవి ఉన్నాడా  లేదా అనే క్లారిటీ లేదు కానీ సినిమా ఎంత ఇంటెన్సిటీతో రూపొందుతోందో ఈ ఒక్క ఫోటో ద్వారానే బయటపడుతోంది.  ఈ మధ్య వరస షెడ్యూల్స్ తో పగలు రాత్రి తేడా లేకుండా  షూటింగ్ లో అలుపు లేకుండా చిరు  పాల్గొనడం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 

ప్రస్తుతం వర్షాలు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ ఆ గ్యాప్ అంతా మిగిలిన రోజుల్లో బాలన్స్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇటీవలే కన్నడ స్టార్ హీరో ఈగ విలన్ కిచ్చ సుదీప్ పది రోజుల కాల్ షీట్ తో ఇందులో జాయిన్ అయ్యాడు . అతని పాత్ర  ఏమిటి దాని తీరుతెన్నులు ఏంటి  అనే వివరాలు బయటికి రాలేదు.  వచ్చే నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: