విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది అంటూ ఈరోజు పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో తన బావమరిది మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ మూవీ కథతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
‘భరత్ అనే నేను’ స్టోరీ లైన్ స్థూలంగా పార్లమెంట్ సాక్షిగా చెపుతూ ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి చనిపోవడంతో విదేశాల నుంచి వచ్చిన భరత్ అనే యువకుడు వచ్చి అనూహ్య పరిస్థితుల్లో డైనమిక్ సీఎంగా మారిన కథను వివరిస్తూ తన తల్లి సూచనతో ఇచ్చిన మాట కోసం విశ్వసనీయతే ప్రధానంగా నడిచిన ఆమూవీ కథను పార్లమెంట్ లోని అందరికీ వివరించారు గల్లా జయదేవ్. ఇదే సందర్భంలో గల్లా జయదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఆమూవీ అంత సూపర్ హిట్ అయిందనీ అటువంటి విస్వనీయత మోడీ ప్రభుత్వంలో కనిపించడం లేదు అంటూ జయదేవ్ మోడీ ప్రభుత్వం పై తన మాటలతో ఎదురు డై చేసారు.
విశ్వసనీయత లేని పాలకులను దేశ ప్రజలు ముఖ్యంగా ఆంద్రప్రజలు క్షమించరు అని అంటూ మోడీ ప్రభుత్వం అంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడ నిలబెట్టుకోలేకపోయిమ మోడీ ప్రభుత్వం పై తీవ్ర పద జాలంతో గల్లా జయదేవ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాలు మాత్రమే కాదు చాలామంది రాజకీయ నాయకుల పేర్లు కూడ తనకు తెలియవు అంటూ తరుచూ మహేష్ సినిమా ప్రస్తావన ఈనాటి అవిశ్వాస తీర్మానం రావడం ఒక విధంగా ఈమూవీ దర్శకుడు కొరటాల శివకుకు ఒక అరుదైన గౌరరవం అనుకోవాలి.
ఇది ఇలా ఉండగా కొద్ది సేపటి క్రితం ఈ అవిశ్వాస తీర్మానం పై తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ మోడీ పై తీవ్ర విమర్శలు చేయడం పార్లమెంట్ లో దుమారాన్ని రేపింది. ఈరోజు ఈ చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పబోయే సమాధానం గురించి భారత దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఇలాంటి సమావేశంలో ప్రిన్స్ మహేష్ ప్రస్థావన రావడం మహేష్ అభిమానులకు ఆనందం కలిగించే విషయం..