తెలుగు ఇండస్ట్రీలో నటి శ్రియ శరణ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ హీరోయిన్ గా తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకర్షిస్తూనే ఉంది. గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో బాలకృష్ణ సరసన నటించిన శ్రియ ఆ మద్య పెళ్లి చేసుకుంది. అయితే వివాహం అనంతరం శ్రియ నటిస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి..కానీ తన కెరీర్ ఇంకా కొనసాగిస్తానని ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా బెల్లన అప్పారావు నిర్మాణంలో .. ఇంద్రసేన దర్శకత్వంలో 'వీరభోగ వసంతరాయలు' సినిమా రూపొందుతోంది.
నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీ విష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రియ చాలా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తుంది. శ్రియ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశారట .. ఆమె కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంటున్నారు.
కాగా, ఈ చిత్రంలో నారా రోహిత్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట..ఫిజికల్ హ్యాండీక్యాప్ గా కనిపించబోతున్నాడట. అంతే కాదు విష్ణు కూడా కొత్త లుక్ లోనే అంటే పూర్తిగా గుండుతో పాటు శరీరం మొత్తం టాటూస్ తో కనిపించబోతున్నాడట. ఇక సుధీర్ ఎలా కనిపిస్తాడో మాత్రం రాలేదు. ఇప్పటికే టైటిల్ మంచి మార్కులు కొట్టేసింది .. పోస్టర్స్ కూడా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటున్నాయి. దాంతో సహజంగా అంచనాలు పెరిగిపోతున్నాయి.