టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ -2 లో భాగంగా రోజు రోజూ రసవత్తరంగా సాగుతుంది.   ఈ నేపథ్యంలో నిన్న బిగ్ బాస్  హౌజ్ లో కొన్ని చిత్ర విచిత్రాలు జరిగాయి.   నిన్న హౌస్ లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కొన్ని స్టేట్ మెంట్స్ ఇస్తూ, అవి ఎవరికి నప్పుతాయో చెప్పాలని బిగ్ బాస్, తన కంటెస్టెంట్ లను అడుగుతున్న వేళ, నందిని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతకీ నందిని గురించి ఆ స్టేట్ మెంట్ ఏంటంటే..'మేడిపండు చూడ మేలిమై ఉండు... పొట్ట విప్పి చూడ పురుగులుండు...' అంటూ వేమన పద్యాన్ని చదివిన బిగ్ బాస్, ఈ స్టేట్ మెంట్ ఎవరికి సరిపోతుందని అడుగగా, అందరూ నందిని పేరు చెప్పారు.

ఆపై సరిగ్గా చెప్పారన్న బిగ్ బాస్, నందినికి ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగి దాన్ని పంపించాడు. తాను హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి కొంత మంది ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని..తన వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదని..ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకుంటున్నారని నందిని తెగబాధపడింది.  తనను పైకి ఒకలా, లోపల మరోలా ఉండే మనిషినంటూ హౌస్ మేట్స్ భావించడంతో నందిని మనస్తాపానికి గురైంది.

ఇక 'ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుగానీ, బిగ్ బాస్ హౌస్ గురించి మాత్రం తెలియదు' అంటే... బాబు గోగినేని పేరును, 'అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతుంది' అన్న స్టేట్ మెంట్ కు గీతా మాధురి చూపించారు.  'కొండంత మనిషైనా కానీ మనసు వెన్న' అంటే అమిత్,  'కొంచెం మంచి కొంచెం చెడు' అంటే కౌశల్ ను, 'కొండంత మనిషైనా కానీ మనసు వెన్న' అంటే అమిత్ ను, 'ప్రేమ పూజారి' అంటే తనీష్ ను, చిన్నదానిగా వచ్చి ఘాటు మిర్చిగా మారింది' అంటే దీప్తి సునయన పేరును,'ఎలిమినేషన్ అంటే భయం' అన్న స్టేట్ మెంట్ కు దీప్తిని హౌస్ మేట్స్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: