పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ముందు నాగచైతన్య ఏస్థాయిలోను సరితూగడు. ఇప్పటి వరకు ఈ అక్కినేని యంగ్ హీరో 50 కోట్ల మార్క్ ను కూడ అందుకున్న సందర్భాలు లేవు. అయితే అనూహ్యంగా నాగచైతన్య పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి సినిమా వల్ల నష్టపోయిన నిర్మాత రాథకృష్ణ సమస్యలు తీర్చడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

చైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీని నిర్మాత రాధకృష్ణ తన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. వాస్తవానికి హారికా హాసినీ సంస్థ కాకుండా రాథకృష్ణకు ఈబ్యానర్ పై కూడ సినిమాలు తీస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ నష్టాలను లెక్కచేయకుండా రాథకృష్ణ చాల వేగంగా నిర్మించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా షూట్ నిన్నటితో పూర్తయిపోయింది అని తెలుస్తోంది.
Naga Chaitanya Sailaja Reddy Alludu movie release date
ఈమూవీ షూటింగ్ మధ్యలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ సమస్యలు ఎదురైనా అవి పట్టించుకోకుండా చైతు దర్శకుడు మారుతికి సహకరించడంతో ఈమూవీ అనుకున్న సమయంకన్నా ముందుగానే పూర్తి అయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి దాదాపు 35కోట్ల బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమూవీని 22 కోట్లతో ఫినిష్ చేసారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై నిర్మాత రాథకృష్ణకు సుమారు 12 కోట్ల వరకు లాభం వచ్చిందని అంటున్నారు. అయితే ఈ రేంజ్ బిజినెస్ రమ్యకృష్ణ అత్త పాత్ర క్రేజ్ తో జరిగిందా లేకుంటే దర్శకుడు మారుతీ బ్రాండ్ తో జరిగిందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నా పవన్ త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ వల్ల రాధ కృష్ణకు వచ్చిన నష్టాలను నాగచైతన్య తీర్చడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: