టాలీవుడ్ లో ఈ మద్య బయోపిక్ సినిమాలే కాదు..మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. గత కొంత కాలంగా మళ్లీ టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మల్టీస్టారర్ సినిమాల్లో ఎక్కువ శాతం విక్టరీ వెంకటేష్ కనిపించాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాల తాజాగా మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో మరో మల్టీస్టారర్ సినిమా లో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ గురువారంతో పూర్తయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
వెంకటేష్, తమన్నా, మెహరీన్లతో కూడిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి..వెంకటేష్, తమన్నా అద్భుతమైన నటులు. వారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాదికి సంక్రాంతి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.తొలి షెడ్యూల్లో చివరి రోజు వరుణ్తేజ్ను మిస్సయ్యాను అని పేర్కొన్నారు.