యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. స్టార్ హీరోగా సూపర్ ఫాంలో ఉన్న ఎన్.టి.ఆర్ టెంపర్ నుండి జై లవ కుశ వర్సకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. స్టార్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వాణిజ్య సంస్థలు కూడా వెంటపడతారు.


ఈ క్రమంలో భాగంగా ఎన్.టి.ఆర్ లేటెస్ట్ యాడ్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడట. సెలెక్ట్ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్. దీని కోసం ఎన్.టి.ఆర్ కు భారీగానే ముట్టచెప్పారట సెలెక్ట్ మొబైల్స్ నిర్వాహకులు. మొబైల్ బ్రాండింగ్ తో పాటుగా సెలెక్ట్ మొబైల్స్ యాడ్ లో కనిపిస్తాడు ఎన్.టి.ఆర్.


5 నిమిషాల యాడ్ కోసం కోటిన్నర ఇది ఎన్.టి.ఆర్ స్టామినా. ఇప్పటికే ఎన్.టి.ఆర్ మలబార్ గోల్డ్, నవరత్న తైళం యాడ్స్ లో కనిపిస్తున్నాడు ఎన్.టి.ఆర్. వాటికి కోటి దాకా తీసుకున్న ఎన్.టి.ఆర్ దీని కోసం మరో 50 లక్షలు అదనంగా తీసుకున్నాడని తెలుస్తుంది. 


ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా బరిలో దమ్ముచూపించేందుకు వస్తున్న ఎన్.టి.ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: