యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ మంచి విజయం అందుకుంది. బాబి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించడం జరిగింది. నివేదా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో తారక్ తన నట విశ్వరూపం చూపించాడు. 


సినిమా వసూళ్లు.. రికార్డులు చాలానే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పింది. సౌత్ కొరియోలో బుచియోన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ లో ఇండియా నుండి 5 సినిమాలను సెలెక్ట్ చేసుకున్నారు.


హిందిలో సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై, అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్స్ తో పాటుగా తెలుగులో జై లవ కుశ, తమిళంలో మెర్సల్ సినిమాలను ఎంపిక చేశారు. తారక్ ట్రిపుల్ రోల్ లో చేసిన నటన, చెప్పిన డైలాగులు ప్రత్యేకంగా నిలిచాయని ఈ సినిమాను అక్కడ ప్రదర్శనకు ఎంపిక చేశారు.


అక్కడ సబ్ టైటిల్స్ తో ఈ సినిమా ప్రదర్శిస్తారట. అంతేకాదు సౌత్ కొరియాలో ప్రదర్శించబడుతున్న తొలి తెలుగు సినిమాగా జై లవ కుశ సంచలన రికార్డ్ సొంతం చేసుకుంది. సినిమా వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా తారక్ సినిమా రికార్డులను కొనసాగించడం గొప్ప విషయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: