ఈరోజు రాత్రి ప్రసారం కాబోతున్న ‘బిగ్ బాస్ 2’ షోలో చాలా షాకింగ్ ట్విస్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. ఈరోజు రాత్రి ప్రసారం కాబోతున్న ‘బిగ్ బాస్’ షో కార్యక్రమం మంచులక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ మూవీకి ప్రమోషన్ కార్యక్రమంగా మారబోతోంది. నేడు ‘బిగ్ బాస్’ హౌస్ లో మంచులక్ష్మి సందడి చేయబోతున్న విషయాన్ని ధృవీకరిస్తూ స్టార్ మా టీమ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన  ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో చూస్తుంటే మంచులక్ష్మి బిగ్ బాస్ సభ్యులతో కలసి బాగా రచ్చ చేసినట్లు తెలుస్తోంది. 
హౌస్ లో వైఫ్ ఆఫ్ రామ్
ప్రస్తుతం ‘వైఫ్ ఆఫ్ రామ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపధ్యం లో నాని హౌస్ సభ్యులతో ముచ్చటిస్తుండగా వారితోపాటు మంచు లక్ష్మి కూడా కూర్చుని ఉన్న సీన్ తో పాటు నాని మంచులక్ష్మి మధ్య సంభాషణ సరదాగా సాగినట్లు ఈప్రోమో బట్టి అర్ధం అవుతోంది.   ఇది ఇలా ఉండగా  తేజస్వి మదివాడ ఎలిమినేషన్ విషయం పూర్తిగా లీక్ అయింది. తేజస్వి ‘బిగ్ బాస్’ హౌస్ నుండి ఎలిమినేట్ అయిందని చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమెను కలిశాను అంటూ ఆమె ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. 
 అరికట్టకపోతే ప్రమాదమే...
ఇటీవల బిగ్ బాస్ షోకు సంబంధించిన రోజువారిగా ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యులకు వస్తున్న ఓట్ల వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ‘బిగ్ బాస్’ షోలో లీకుల పర్వం ఇలానే కొనసాగితే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని స్టార్ మా టీవీ టీమ్  గుర్తించినా ఈ లీకులు ఎలా వస్తున్నాయో తెలియక తల పట్టు కుంటునట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు హౌస్‌ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌ మెట్స్‌ తో నిన్న వ్యాఖ్యానించినట్లు కూడ  తెలుస్తోంది. 
అధికారులు నన్ను ఆపారు
ప్రస్తుతం ఈషో అన్నపూర్ణ స్టూడియోస్‌ లో జరుగుతూ ఉండటంతో పాటు బయటకు వచ్చిన వెంటనే సెలెబ్రెటీలు స్నేహితులను కలుస్తుండటం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెడుతుండటంతో షో ప్రసారం కాకముందే ఎలిమినేట్ అయింది ఎవరనేది లీక్ అవుతోంది. ఇలాంటివి జరుగకుండా అరికట్టక పోతే ఈషో విషయంలో స్టార్ మా రేటింగ్స్ విషయంలో బాగా దెబ్బపడే ప్రమాదం ఉందని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: