మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ కొనిదెల నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్' సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో రామ్ చరణ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నిహారిక కోసం తాను ఈ ఫంక్షన్ కు రాలేదని... ఎమ్మెస్ రాజు గారి కోసం వచ్చానని చెప్పాడు. ఓకానోక సమయంలో అనుకోకుండా ఐదు వేలు డబ్బు అవసరం ఉంది నాన్న కొంతమందిని అడిగారట..ఆ సమయంలో ఎవరూ సహాయం చేయలేదట. కానీ ఎమ్మెస్ రాజుగారు రూ. 5 వేలు ఇచ్చి ఆదుకున్నారట. మధ్యనే నాన్న ఈ విషయాన్ని మా వద్ద గుర్తు చేసుకున్నారు అని తెలిపాడు చరణ్. ఇండస్ట్రీలో ఆయన ఎంతో మందికి ఉపాది కల్పించారు..చాలా మంది కష్టాల్లో ఉంటే ఆదుకున్నారని మా నాన్న పలు మార్లు గుర్తు చేసేవారని అన్నారు.
అలాంటి ఎమ్మెస్ రాజు గారు ఫంక్షన్ కి రమ్మని అడిగితే, రెండో విషయం ఆలోచించకుండా వచ్చేశానని చెప్పాడు. సినీ పరిశ్రమలో రాణించాలంటే మంచితనం కూడా ఉండాలని తెలిపాడు.
ఇక నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..గతంలో ఒకమనసు సినిమాతో నిహారిక ఎంతో మంచి పేరు తెచ్చుకుందని..నిమారికను చిన్ననాటి నుంచి చూస్తున్నానని ఆమెకు నటనపై ఎంత ఆసక్తి ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
సెట్లో యూనిట్ అంతా తనను గాజు బొమ్మలా చూసుకున్నారని నిహారిక తెలిపింది. ఈ సినిమాలో నిహారిక ఒక సాధారణ అమ్మాయి నసులోని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారని చెప్పింది. షూటింగ్ లో నిజంగానే పెళ్లి వాతావరణం కనిపించిందని తెలిపింది. ఈ సినిమాలో నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి.