భారత దేశంలో పలు భాషల్లో నటించి అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి.  సినీ ఇండస్ట్రీకి బాలనటిగా ప్రవేశించిన శ్రీదేవి తర్వాత హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.  అంతే కాదు రెండు తరాల హీరోలతో నటించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది.  అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివామం చేసుకుంది.  వీరిద్దరికి జాహ్నవి, ఖుషి కపూర్ లు జన్మించారు.  అయితే జాహ్నవిని హీరోయిన్ గా చూసుకోవాలని ఎన్నో ఆశలు పడింది.  కానీ అనుకోకుండా దుబాయ్ లో ప్రమాదంలో మరణించింది. 
Image result for jhanvi kapoor
కాకపోతే శ్రీదేవి తన కూతురు డెబ్యూ సినిమా ‘ధడక్’షూటింగ్ మొదలు పెట్టే సమయానికి ఉన్నా విడుదల అయ్యే సమయానికి లేకపోవడం ఆ కుటుంబం ఎంతో బాధపడింది.  అయితే ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన శ్రీదేవి, బోనీకపూర్‌ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ రెమ్యునరేషన్‌పై కూడా ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో తొలిరోజున దేశవ్యాప్తంగా రూ.8.71 కోట్లను వసూలు చేసిందని సమాచారం.

ఈ సినిమా కోసం హీరోయిన్ జాన్వీకపూర్, హీరో ఇషాన్‌కు చెరో రూ.60 లక్షలను నిర్మాత కరణ్‌జోహార్ రెమ్యునరేషన్‌గా అందజేశాడట.  నిమాలో జాన్వీకి తండ్రి పాత్రలో నటించిన అశుతోష్ రాణాకు రూ.80 లక్షల పారితోషికాన్ని ఇచ్చారట.ధడక్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం గొప్ప విషయమని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు.  ఇదిలా ఉంటే..జాహ్నవి తన రెండవ సినిమాకు భారీ రెమ్యూరేషన్ తీసుకుంటుందని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: