యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానార్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. హాలీవుడ్ తరహా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమా లైన్ లో పెట్టాడు. 


జిల్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ తర్వాత సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్ లో రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తవగా ఆగష్టు నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కథ 1940, 50 బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది.


పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా పూజా హెగ్దె నటిస్తుందని తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది తప్పకుండా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాహో సినిమాతో కచ్చితంగా ప్రభాస్ మళ్లీ బాహుబలి రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 


బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ సినిమా కూడా భారీ స్కెచ్ వేశాడని చెప్పొచ్చు. ఈ సినిమా యూరప్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా ఇది కూడా ప్రభాస్ కెరియర్ లో క్రేజీ మూవీగా రాబోతుందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: