‘బిగ్ బాస్‌’ లో కీలకమైన ఎలిమినేషన్ రోజైన నిన్న ఆదివారం ఆసక్తికరమైన పరిణామాలతో పాటు ‘బిగ్ బాస్’ షోని చూస్తున్న ప్రేక్షకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నాని. మూడు రోజుల క్రితం ‘బిగ్ బాస్’ షోను నిర్వహిస్తున్న టీమ్ తనను కలిసి ఈ షో పై ముఖ్యంగా ఈ షో హౌస్ మేట్స్ పై సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న కొన్ని అసబ్య పదజాలాలు తనకు చూపించినప్పుడు తాను షాక్ అయిన విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు ఆ కామెంట్స్ ను చూసాక మనం అసలు సభ్యసమాజంలో జీవిస్తున్నామా అన్న అనుమానాలు తనకు కలుగుతున్న విషయాన్ని తెలియచేసాడు. 
ఇంట్లోకి మంచు లక్ష్మీ
బుల్లితెర పై ప్రసారం అయ్యే ఒక షో నచ్చలేదు అంటూ విమర్శించే హక్కు అందరికీ ఉన్నా మనసులో ఇంత విషం పెట్టుకుని ఇంత భయంకరమైన పదాలతో ఎదుట మనుషులను టార్గెట్ చేస్తారా అంటూ తీవ్ర విమర్శలు చేసాడు నాని. ఒక అన్నగా  ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని సలహాఇస్తున్నాను వింటే బాగుపడతారు లేకుంటే చెడిపోతారు అంటూ ఘటైన కామెంట్స్ చేసాడు నాని. ఇప్పుడు ఈ కామెంట్స్ ‘బిగ్ బాస్’ షోను క్రమం తప్పకుండ చూస్తూ కామెంట్స్ చేస్తున్న చాలామందికి అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 
సామ్రాట్‌తో ప్రేమలో పడటం వల్లే
అందరూ ఊహించినట్లుగానే నిన్నటి షోలో తేజస్విని ఎలిమినేషన్ రౌండ్ లో బయటకు వెళ్ళిపోయింది. నిన్నటి షోకు అనుకోని అతిధిగా వచ్చిన మంచు లక్ష్మీని చూడగానే ఇంటి సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇంట్లోకి వెళ్లగానే సామ్రాట్‌పై మంచు లక్ష్మీ ఫైర్ అయింది. సినిమా ప్రమోషన్‌కు రాకుండా బిగ్‌బాస్ ఇంట్లోకి చెప్పకుండా వస్తావా అని నిలదీసింది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందని చెప్పడంతో సామ్రాట్ సంతోషంలో మునిగిపోయాడు. 
గణేష్‌పై తేజస్వి బిగ్‌బాంబ్
ఇక నిన్నటి ‘బిగ్‌ బాస్’ హౌస్ నుంచి బయటకు వెళ్తూ తేజస్విని తన హౌస్ మేట్స్ అందరికీ రేటింగ్స్ ఇస్తూ సందడి చేసింది. ముఖ్యంగా గీతామాధురిని ‘బిగ్ బాస్’ హోస్ మేట్స్ కు ‘అమ్మ’ అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక చివరిగా ‘బిగ్‌ బాస్’ హోస్ నుంచి వెళ్ళిపోతూ తేజస్విని గణేష్ ను ఇక నుంచి పాలపీకలో నీళ్లు తాగాలి అని తన బాంబు వేసి ఈ షోను రక్తి కట్టించడానికి తన ప్రయత్నాలు చేసింది. ఏమైనా నాని ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు ఇచ్చిన వారింగ్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: