తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ లో ఆరుగురు ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి బిగ్ బాస్ లో అందరిచే చివాట్లు తింటూ..సామ్రాట్ తో రొమాన్స్ చేస్తూ నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్న తేజస్విని నిన్న ఎలిమినేషన్ అయ్యింది. కాగా, తేజస్వినిని ఎలిమినేషన్ చేయాలని నెటిజన్ల నుంచి బిగ్ బాస్ మెసేజ్ లు వచ్చాయని.. హౌస్లోని అందరూ.. అందరికీ నచ్చాలనేమీ లేదని, ఆ విషయాన్ని చెప్పొచ్చని, కానీ అసభ్యపదజాలంతో కామెంట్స్ చేయడం సరికాదని అన్నాడు. తేజస్వి విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధగా ఉందన్నాడు.
దేశంలో మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పడం కాదు..అది ఆచరించి చూపించాలని అన్నారు. నిజంగా తేజస్వి విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే..ఇంత ఛండాలమైన భాష వాడుత కామెంట్స్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది. బయట ఇలాంటి మనుషులు ఉన్నారా? అని అనిపిస్తోందన్నాడు. కామెంట్స్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే నిన్న బిగ్బాస్ హౌస్లో మంచు లక్ష్మి సందడి చేసింది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్బాస్ హౌస్లోకి వచ్చిన ఆమె హౌస్మేట్స్ తో కలిసి కాసేపు సందడి చేసింది. గణేశ్ ఆర్జేగా అవతారమెత్తాడు.
కాగా, ఈసారి నానికి బదులు మంచు లక్ష్మి ఎలిమినేషన్ను ప్రకటించింది. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామ్రాట్కు నోటమాట రాలేదు. షో చివరి వరకు మూడీగానే ఉన్నాడు. ఇక, తేజస్వీ వెళ్తూవెళ్తూ బిగ్బాంబ్ను గణేశ్పై విసిరింది. బిగ్బాంబ్లో భాగంగా గణేశ్ ఈ వారమంతా పాలసీసాతో నీళ్లు తాగాల్సి ఉంటుంది.