బిగ్ బాస్ ఊహలకు అందదంటే ఇదేనేమో.. ఈ వారం ఎలిమినేషన్ బిగ్ బాస్ మళ్లీ అందరికి షాక్ ఇచ్చాడు. లీకైన గ్రాఫ్ లెక్కల ప్రకారం ఈవారం సామ్రాట్ రెడ్డి ఎలిమినేషన్ అనిపించగా చివర్లో తేజశ్విని బయటకు పంపించి బిగ్ బాస్ అంచనాలకు మించి అనుకునేలా చేశాడు. తేజశ్వి ఇంటి సభ్యులలో స్ట్రాంగ్ కంటెస్టంట్.


అలాంటి తేజశ్విని ఎలిమినేట్ చేశారంటే కచ్చితంగా ఆడియెన్స్ మాత్రమే కాదు ఇంటి సభ్యులకు ఫీజులు ఎగిరిపోయాయి. సామ్రాట్ ఎలిమినేట్ అవుతాడని ఇంట్లో వాళ్లు కూడా డిసైడ్ అయ్యారు. అందుకే తేజశ్వి అని పేరు చెప్పగానే అందరు అవాక్కయ్యారు. కచ్చితంగా బిగ్ బాస్ లెక్కలు ఎవరు ఊహలకు అందవని దీని ద్వారా తెలిసింది.


నిన్నటి ఎపిసోడ్ లో మంచు లక్ష్మి స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లారు. తన సినిమా వైఫ్ ఆఫ్ రామ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె బిగ్ బాస్ హౌజ్ లో కొంతసేపు గడిపారు. ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ వారం ఎలిమినేషన్ మంచు లక్ష్మి ద్వారా చెప్పించేశాడు నాని. ఆమెతో పాటే ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. 


ఫైనల్ గా తేజశ్విని మంచు లక్ష్మి బయటకు తెచ్చింది. కౌశల్ తో జరిగిన గొడవ వల్ల లాస్ట్ వీక్ భాను ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం తేజశ్వి బయటకు వచ్చింది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద అందరి గురించి మాట్లాడి 10 అవుట్ ఆఫ్ అంటూ రేటింగ్ ఇచ్చిన తేజశ్వి కౌశల్ కు 5 రేటింగ్ ఇచ్చి మళ్లీ టార్గెట్ చేసింది. నాని ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే.. కౌశల్ మీరు బిగ్ బాస్ విన్నర్ అవ్వొచ్చు కాని నేను అందరు మనసులను గెలిచేశానని చెప్పి గట్టి పంచ్ ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: