తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో చిరంజీవి, రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ లతో కలిసి నటించిన నటుడు సాయిచంద్ చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ చిత్రంలో నటించాడు. సాయిపల్లవి తండ్రిగా మంచి ఎమోషనల్ పాత్రలో నటించిన సాయిచంద్ మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సాయిచంద్ పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో ఇతర భాషల నటులు అమితాబచ్చన్, విజయ్ సేతు పతి, సుదీప్ లాంటి వాళ్లు ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా ‘సైరా’ చిత్రంలో సాయిచంద్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయిచంద్ సెలెక్టెడ్ రోల్స్లోనే ఎక్కువగా నటిస్తుంటాడు. అయితే.. సైరాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మూవీ టీమ్ సాయిచంద్ను సంప్రదించిందట. ముఖ్యమైన పాత్ర కావడంతో సాయిచంద్ కూడా ఓకే అన్నట్లు సమాచారం.
80వ దశకంలో సాయిచంద్ వచ్చిన మాభూమి, రంగులకల, మంచు పల్లకి, ఆడవాళ్లే అలిగితే, శివ, అంకురం లాంటి సినిమాల్లో నటించాడు. నరసింహరెడ్డి మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రకెక్కాడు. రూ.200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, నయనతార, కన్నడ హీరో సుదీప్, తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారు.