తెలుగు ఇండస్ట్రీలో నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్.  నట కిరీటిగా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాజేంద్ర ప్రసాద్ ఓ హీరోయిన్ కి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.  నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'.  ఈ చిత్రానికి  దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. 
మళ్లీ మళ్లీ చూస్తారు
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.  పెళ్లి విశిష్టతను తెలియజెప్పే ఒక అద్భుతమైన చిత్రం అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నటి పూనమ్ నవ్వడంతో ఆయన ఒక్కసారే సీరియస్ అయ్యారు. నేను ఈ చిత్రంలో నటించాను కనుక ఫంక్షన్ కి మా ఆవిడను వెంటబెట్టుకొచ్చానని అనడంతో ఒక్కసారిగా పూనమ్ కౌర్ నవ్వేసింది. దాంతో రాజేంద్ర ప్రసాద్ కి ఒక్కసారే చిర్రెత్తుకు రావడంతో..‘ఓయ్ పూనమ్ యూవర్ టూ యంగ్ టు ఫీల్ లైక్ దట్, నేను నిజాయితీగా చెబుతున్నాను, నువ్వు అలా నవ్వడం సరికాదు'.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
 దిల్ రాజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం
ఇండస్ట్రీలో నేను ఎన్నో సినీ ఫంక్షన్లకు అటెండ్ అయ్యాను..కానీ మొదటి సారి మా ఆవిడతో రావడం ఇదే ఫస్ట్ టైం. దానికి కారణం  కారణం నాకు ఈ సినిమా ద్వారా ఆఫీల్ కలుగడమే.యాక్ట్ చేసిన నేనే మా ఆవిడను తీసుకుని వస్తే... రేపు సినిమా చూసిన మీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సార్లైనా చూస్తారనే నా నమ్మకం... అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇండస్ట్రీలో మాకు తండ్రిలాంటి వారు స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు..చిత్రాల గురించి ఆయనకు ఎంత అభిలాష ఉంటుందో..అలాంటి అభిలాష ఇప్పటి తరంలో దిల్ రాజు కి ఉందని అన్నారు. అలా ఉంటేనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లు అవుతారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: