టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలసిందే.  ఇప్పటికే మహానటి సినిమా మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ జరుగుతుంది.  ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత’ సినిమా తెరకెక్కిస్తున్నారు.   ప్రధాన పాత్రలో మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు.
Image result for yatra movie
ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మమ్ముట్టి ఏకధాటిగా డేట్లు కేటాయించడంతో, నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతోంది.జూన్ 20న చిత్రీకరణ మొదలవ్వగా సెప్టెంబర్లో పూర్తయ్యేలా సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. మమ్ముట్టిని చూస్తుంటే అచ్చం వైఎస్ఆర్‌ను చూసినట్లే ఉందని, ఆయన రూపం, నడక, బాడీ లాంగ్వేజ్ జన నేతను గుర్తు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

సినీమా రిలీజ్‌‌లకు అత్యంత కీలకమైన సమయం ఇది. ఈ సమయంలో అయితేనే ఈ బయోపిక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే 'ఎన్టీఆర్' బయోపిక్ ను సంక్రాంతికి థియేటర్స్ కి తీసుకురానున్నట్టు బాలకృష్ణ చెప్పారు. చరణ్ హీరోగా బోయపాటి తీస్తున్న సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలనుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఎఫ్ 2' సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు. అంత పెద్ద సినిమాల రిలీజ్ అవుతున్న సమయంలో యాత్ర ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: