ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ సీజన్ 1 లో హౌజ్ సభ్యుల మద్య ప్రశాంత వాతావరణం నెలకొంది.  గెలిచే వరకు ఎవరి మద్య పెద్ద వివాదాలు లేకుండా చాలా కూల్ గా సాగింది.  కానీ బిగ్ బాస 2 మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  గ్రూపులు, బహిరంగ లవ్ సీన్లు, వ్యక్తులను టార్గెట్ చేసుకోవడాలు అన్నీ జరుగుతున్నాయి. 

ఒకదశలో అసలు బిగ్ బాస్ చూడాలంటేనే ఛీ అనే పరిస్థితి కి వస్తుంది.  ముఖ్యంగా నటుడు కౌశల్ ని మొదటి నుంచి హౌజ్ సభ్యులు ట్రీట్ చేస్తున్న విధానం చాలా బాధాకరంగా అనిపిస్తుంది.  అయితే కౌశల్ టార్గెట్ చేసిన కిరీటి, భానుశ్రీ, తేజస్వి ముగ్గురు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.  తాజాగా  కౌశల్ హౌస్‌లోని తోటి  సభ్యులకు మళ్లీ టార్గెట్‌గా మారాడు.ఎలిమినేషన్ టాస్క్‌లో భాగంగా మిగతా సభ్యులందరూ కౌశల్‌ను టార్గెట్ చేసి అతడి నెత్తిపై గుడ్లు పగలగొట్టారు.

అమిత్‌, రోల్‌ రైడా, తనీష్‌, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. దీంతో కౌశల్ నామినేషన్‌లోకి వెళ్లిపోయాడు. కౌశల్ తన వంతు వచ్చినప్పుడు  నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు.  కాగా, సోమవారం అర్ధరాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరో ఓ కొత్త వ్యక్తి ప్రవేశించడం కనిపించింది. అయితే, అది ఎవరన్నది నేడు తెలియనుంది.

ఇక తనను ఎలిమినేషన్ నుంచి కాపాడినట్టు కౌశల్ పదేపదే గుర్తుచేస్తూ హింసిస్తున్నాడని కౌశల్‌పై నందిని ఇంటి సభ్యులకు ఫిర్యాదు చేసింది. కౌశల్ తర్వాత నామినేట్ అయినవారిలో బాబు గోగినేని,  దీప్తి సునయన, గణేశ్ ఉన్నారు. షో చివర్లో బిగ్ బాస్ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: