'బిగ్ బాస్ హౌస్' లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా సందడి చేసిందెవరయ్యా అంటే ఎవరైనా సరే తేజస్వి.  అయితే మొదట్లో ఆ సందడి కాస్త సరదా అనిపించినా..తర్వాత కాస్త వెటకారంగా తయారైంది.  సామ్రాట్, తేజస్వి, తనిష్ ఈ ముగ్గురూ ఒక జట్టుగా మెసులుతున్నారని టాక్ వచ్చింది.  అంతే కాదు ఈ విషయం పై బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని సైతం సిరియస్ అయ్యారు.  ఇదిలా ఉండగా సామ్రాట్, తేజస్వి మద్య గత మూడు వారాలుగా రొమాన్స్ కొనసాగుతుంది. 
Image result for tejaswi samrat
దాంతో బిగ్ బాస్ హౌజ్ లో సామ్రాట్, తేజస్వి లవ్ లో పడిపోయారని..వారి మద్య డీప్ గా లవ్ ఎఫైర్ నడుస్తుందని నెటిజన్లు అనుకుంటూ వచ్చారు.  అందుకు తగ్గట్లు తేజస్వి, సామ్రాట్ అలాగే నడుకుంటూ వచ్చారు. మరోవైపు తేజస్వి హౌజ్ సభ్యుడైన కౌశల్ ని టార్గెట్ చేసుకోవడం..ఓ టాస్క్ లో భానుశ్రీ, తేజస్వి కలిసి కౌశల్ ని బూతులు తిట్టడంతో నెటిజన్ల కోపానికి గురయ్యారు. 

అప్పటి నుంచి తేజస్వి ఎలిమినేట్ కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వచ్చారు.   మొత్తానికి మొన్నటి ఆదివారం తేజస్వి ఎలిమినేట్ అయ్యారు.  ఈ సందర్భంగా పలు చానల్స్ లో తేజస్వి ఇంటర్వ్యూలు ఇస్తు వస్తుంది.  తాజాగా ఆమె ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ "అందరూ కూడా సామ్రాట్ కు ..నీకు మధ్య ఏముంది? అని అడుగుతున్నారు.
Image result for tejaswi samrat
మా మధ్య ఏమీ లేదు .. ఆయన ఒక మంచి మనిషి .. అలాగే తనీశ్ కూడా. మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్లని ఒక టీమ్ అనొచ్చు .. మరేదైనా అనొచ్చు. షోలో సామ్రాట్ కనిపించడం లేదు .. నన్నే ఎక్కువగా చూపించారు.  నా గురించి వేరేవాళ్లు మాట్లాడుకోవడం చూపించారు. తిరిగి 'బిగ్ బాస్ హౌస్'లోకి వెళ్లాలనుకుంటున్నాను .. అది మీ చేతుల్లోనే వుంది" అని చెప్పుకొచ్చింది.     


మరింత సమాచారం తెలుసుకోండి: