యంగ్ రెబల్ స్టార్ బాహుబలికి ముందు దాకా కేవలం తెలుగు హీరో మాత్రమే.. కాని బాహుబలి రెండు సీజన్ల తర్వాత నేషనల్ వైడ్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత సుజిత్ డైరక్షన్ లో సాహో మూవీ చేస్తున్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది.


ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మళ్లీ యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమా చేయాలని చూస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉండబోతుందట. ఈ సినిమా కూడా పిరియాడికల్ మూవీగా తెరకెక్కనుందట. 1940-50 మధ్యలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా వస్తుందట. 


అయితే ఈ సినిమా కథ యూరప్ లో నడుస్తుందట. అక్కడ లాంగ్ షెడ్యూల్ కష్టమని భావించి యూరప్ సెట్ నే హైదరాబాద్ లో వేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టు నుండి మొదలు పెట్టబోతున్న ఈ సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తుంది. చూస్తుంటే యువి వారు ఈ సినిమాను భారీగానే చేసేలా ఉన్నారు.


ఎలాగు సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ 300 నుండి 500 కోట్ల దాకా అయ్యే ఛాన్స్ ఉంది. సాహో కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 2019 సమ్మర్ లో రాబోతున్న ఈ సాహో సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తుండగా ఆ తర్వాత రాధాకృష్ణ మూవీ కూడా మరో క్రేజీ మూవీ అవుతుందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: