టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో రాజమౌళి నంబర్ 1 రేసులో ఉంటే అటు ఇటుగా ఆ తర్వాత స్థానాల్లో త్రివిక్రం కూడా ఉంటాడు. దర్శకులుగా ఎవరి సత్తా వారిది. ఎవరి సినిమాలు వారివి. అయితే రాజమౌళి మార్కెట్.. సినిమా లెక్క వేరేలా ఉంటుంది. త్రివిక్రం సినిమా రేంజ్ అందరికి తెలిసిందే.


ఇద్దరివి వేరే మార్గాలైనా ఇప్పుడు రాజమౌళి దారిలోనే త్రివిక్రం నడవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు త్రివిక్రం. ఆ సినిమా లీకుల గోల ఈమధ్య ఎక్కువైంది. స్టార్ సినిమా సెట్స్ మీద ఉండగానే పిక్స్ లీకైతే ఆ నష్టం ఎలా ఉంటుందో తెలిసిందే.


ఈమధ్యనే అరవింద సమేత నుండి ఎన్.టి.ఆర్ ఎమోషనల్ పిక్ ఒకటి లీక్ అయ్యింది. సినిమా లో హైలెట్ గా నిలిచే సీన్స్ లో ఒకటైన ఆ సన్నివేశంలోని ఫోటో లీక్ అవడం పట్ల త్రివిక్రం చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. అందుకే ఇక రాజమౌళి దారిలోనే సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరు సెల్ ఫోన్స్ నాట్ ఎలోడ్ అని చెబుతున్నాడట.


షూటింగ్ కు వెళ్లే ముందే సెల్ ఫోన్స్ ఇచ్చేసి వెళ్లాలట. అలా ఈ లీకులను ఆపేయాలని చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దసరా బరిలో దించాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: