తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యావత్ భారత దేశంలో ఎంతో మంది ఇష్టపడతారు.  ఒక్క భారత దేశంలో నే కాదు ఇతరు దేశాల్లో కూడా రజినీకాంత్ కి మంచి అభిమానులు ఉన్నారు.  అందుకే ఆయన సినిమాలు మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ సక్సెస్ ఫుల్ గా ఆడతాయి.  ఇక రజినీకాంత్ కెరీర్ లో ది బిగ్గెస్ట్ హిట్ సినిమాలు బాష, నరసింహ.  గతంలో రజినీకాంత్ భాష సినిమా సీక్వెల్ లో రాబోతున్నారని వార్తలు వచ్చాయి.  కానీ అలాంటి క్లాసికల్ మూవీస్ ని టచ్ చెయ్యడం కరెక్ట్ కాదని అన్నాడు.


బాషా సీక్వెల్ కి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఇప్పుడు రజినీకాంత్ నరసింహకి సీక్వెల్ చెయ్యబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కలయికలో వచ్చిన నరసింహ సినిమా అనేక రికార్డులను కోల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.   నరసింహ సినిమాలో రజినీకాంత్ కన్నా ఎక్కువగా నీలాంబరి పాత్రధారి అయిన రమ్యకృష్ణ పాత్రకే ఎక్కువ స్కోప్ అండ్ పవర్ ఉండడంతో… రజినీ అభిమానులు రమ్యకృష్ణ ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకోవడం లాంటివి కూడా చేశారు.
Image result for rajini kanth narasikha
అలాంటి సినిమాకి ఇప్పుడు మళ్లీ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీక్వెల్ రాబోతుందని న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతుంది.  వుట్ డేటెడ్ దర్శకుడిగా కెఎస్ రవికుమార్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో బాలయ్య తో తెలుగులో తీసిన జై సింహ యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది.  కార్తీక్ సుబ్బరాజు సినిమా పూర్తవగానే సూపర్ స్టార్ రజినీతో ఈ సినిమాని కెఎస్ రవికుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.   
Image result for bobo 2.0 rajini
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 2.ఓ విడుదలకు సిద్దమవుతుంది. ఇక వచ్చే ఏడాది కార్తీక్ సుబ్బరాజు మూవీ తో పాటుగా ఈ కెఎస్ రవికుమార్ తో చేసే నరసింహ సీక్వెల్ ఉండేలా రజినీ ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఒకవేళ నరసింహ సీక్వెల్ వస్తే మాత్రం రజినీకి మరో ఘన విజయం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: