సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.  తన మొదటి సినిమా అల్లుడు శీను తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ఇప్పుడు ‘సాక్ష్యం’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే..  `స్పీడున్నోడు` డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో `జయ జానకి నాయక` మరో ఫ్లాప్.

దీంతో అతడి కెరీర్ విషయంలో ఏం జరుగుతోంది? అన్న సందిగ్ధత నెలకొంది. ఓవైపు కొడుకు కెరీర్ నిలబెట్టేందుకు డాడ్ బెల్లంకొండ సురేష్ రాజీ లేని ప్రయత్నంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.  ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి.  ఓవైపు కొడుకు కెరీర్ నిలబెట్టేందుకు డాడ్ బెల్లంకొండ సురేష్ రాజీ లేని ప్రయత్నంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.తరచి చూస్తే.. కెరీర్ లో అన్నీ పరాజయాలే. అందుకు కాస్ట్ ఫెయిల్యూర్ - భారీ బడ్జెట్లు కారణమన్న టాక్ వినిపించింది. ఒక అప్ కం హీరోని నమ్మి భారీ పెట్టుబడులు కుమ్మరించడంపైనా - హీరోయిన్లకు భారీ పారితోషికాలపైనా ఆసక్తికర చర్చ సాగింది.  `సాక్ష్యం` పంచభూతాల కాన్సెప్ట్ అంటూ ఊదరగొడుతున్నారు. పూర్తిగా యాక్షన్ ని - మాస్ ని నమ్ముకున్నారు. మరి పంచభూతాలే అతడిని నిలబెడతాయా?  లేదా? అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: