మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ గందరగోళంగా ఉందని అతని సినిమాల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన తేజ్ ఐలవ్యూ సినిమా కూడా తేజూని నిరాశ పరచింది. అందుకే కొద్దిపాటి గ్యాప్ తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం యూఎస్ చెక్కేసిన మెగా హీరో అక్కడే కొన్నాళ్లు ఉండాలని అనుకుంటున్నాడట. 


తేజ్ ఐలవ్యూ ప్రమోషన్స్ లో కాస్త లావెక్కినట్టు కనిపించిన సాయి ధరం తేజ్ స్లిమ్ లుక్ తో మళ్లీ అందరికి ననిపిస్తాడని తెలుస్తుంది. అయితే ఈ మేకోవర్ తన తర్వాత సినిమా కోసమే అని అంటున్నారు. తేజూ తన తర్వాత సినిమా కిశోర్ తిరుమల డైరక్షన్ లో చేయాల్సి ఉంది.  


చిత్రలహరి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఆగష్టులో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమాకు మరికాస్త టైం అడుగుతున్నాడని తేజ్. వరుస ఫ్లాపుల వల్ల మెగా మేనళ్లుడు డిప్రెషన్ లోకి వెళ్లాడని తెలుస్తుంది. ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే కొద్దిరోజులు టైం కావాలని అంటున్నాడట.


సినిమా నిర్మాతలు తేజ్ నిర్ణయానికి షాక్ అయ్యారట. వరుస సినిమాలను నిర్మిస్తూ పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ సాయి ధరం తేజ్ సినిమా విషయంలో కాస్త కంగారుగా ఉన్నారట. మరి ఎన్నాళ్లు తేజూ వారిని వెయిట్ చేయిస్తాడో చూడాలి. కనీసం ఈ చిత్రలహరి అయినా సాయి ధరం తేజ్ ను ఫ్లాపుల నుండి బయట పడేలా చేయాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: