ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా’ కు ఊహించని ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి అని వార్తలు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న ఈమూవీకి ఆర్ధిక సమస్యలు ఏమిటి అంటూ కొందరు ఈ వార్తలను గాసిప్పులుగా ఖండిస్తున్నారు.
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో అదేవిధంగా అత్యంత భారీ తారాగణంతో నిర్మింపబడుతున్న ఈమూవీకి 250కోట్ల బడ్జెట్ అవుతుంది అని అంటున్నారు. మొదట్లో ఈమూవీ ప్రాజెక్ట్ ను అనుకున్నప్పుడు చరణ్ ఈమూవీ పై ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టవలసి వస్తుందని ఊహించలేదు అనిఅంటున్నారు. దీనికితోడు ఈసినిమా షూటింగ్ విషయంలో రకరకాల సమస్యలు ఏర్పడటంతో ఈమూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగి పోవడమే కాకుండా ఈమూవీ నిర్మాణ విషయాలను పర్యవేక్షించడం చరణ్ కు సమస్యగా మారింది అని అంటున్నారు.
దీనికితోడు చరణ్ సినిమాలలో బిజీగా మారిన నేపధ్యంలో ఈమూవీ బడ్జెట్ విషయంలో సరైన నియంత్రణ కొనసాగించ లేకపోతున్నాడని తెలుస్తోంది. ఈపరిస్తుతులలో ‘సైరా’ కు అన్నివిధాలా సహాయం అందిస్తూ ఈమూవీకి సహనిర్మాతగా వ్యవహరించడానికి చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన ఎన్.వి.ప్రసాద్ ను చరణ్ రంగంలోకి దింపుతున్నట్లు టాక్. గతంలో చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రసాద్ సీడెడ్ ఏరియాలో అనేక ప్రముఖ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.
ఇది ఇలా ఉండగా ఎవరూ ఊహించని విధంగా తాజాగా బాలీవుడ్ సంగీత సంచలనం అమిత్ త్రివేదిని ఈమూవీ సంగీత దర్శకుడుగా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే ఇతడు ఈమూవీకి సంబంధించిన పాటల ట్యూన్స్ ను చిరంజీవికి వినిపించినట్లు టాక్. మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22న ‘సైరా’ టీజర్ విడుదల కాబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ టీజర్ కోసం అమిత్ ట్యూన్స్ రెడీ చేస్తున్నట్టు సమాచారం..