తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2, 45వ ఎపిసోడ్లో ఇంటి సభ్యులు తమ ఫ్యామిలీస్తో ఫోన్లో మాట్లాడే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు కౌశల్, రోల్ రైడా, సామ్రాట్లు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి చాలా ఆనందాన్ని పొందుతారు. మొన్నటి ఎపిసోడ్ లో కౌశల్ తన భార్యతో మాట్లాడుతూ ఎంతో సంతోషంతో పాటు కన్నీరు కూడా పెట్టుకున్నారు..గేమ్ చాలా బాగా ఆడుతున్నావంటూ కితాబు ఇచ్చింది కౌశల్ భార్య.
ఇక రోల్ రైడా తన చెల్లెలితో మాట్లాడారు..ఇక సామ్రాట్ విషయానికి వస్తే..గేమ్ చాలా బాగా ఆడుతున్న ప్రత్యేక వ్యక్తులో అటాచ్ మెంట్ పెట్టుకోవడం పట్ల ప్రేక్షకులు వేరే రకంగా భావిస్తున్నారని..బిగ్ బాస్ లో గేమ్ ఆడటానికి వెళ్లారే తప్ప వేరే పని కోసం కాదని ఒక రకంగా క్లాస్ పీకింది. తాజాగా బుధవారం నాటి ఎపిసోడ్లో ఛాన్స్ టూ టాక్ మీటర్ రీచార్జ్ చేయడానికి హౌజ్లోకి కొత్తగా వచ్చిన పూజాని పెండతో కూడిన టబ్లో నుండి 50 టోకెన్స్ తీయమని కోరతారు బిగ్ బాస్ . ఏ మాత్రం ఆలోచించకుండా అందులో నుండి టోకెన్స్ తీస్తుంది పూజా.
46వ ఎపిసోడ్లో ముందుగా వచ్చిన కాల్ని సామ్రాట్ రిసీవ్ చేసుకుంటాడు. అవతలి వారు ఇచ్చిన మూడు క్లూస్ సామ్రాట్ గుర్తుకు పట్టకపోవడంతో కాల్ కట్ అవుతుంది. అయితే కాల్ చేసిన వ్యక్తి నందిని ఫ్రెండ్ అని తెలిసి ఆమె కాస్త ఫీలవుతుంది. బాబు గోగినేనికి తన వైఫ్ నుండి కాల్ వస్తుంది. సరదాగా మాట్లాడుతూ.. చివరిలో ఓ కిస్ ఇవ్వు మై స్వీట్ హార్ట్ అనగా.. స్వీట్ కిస్ ఇచ్చేస్తుంది బాబు భార్య. వెంటనే మరో కాల్ రాగా, దానిని రిసీవ్ చేసుకున్న బాబు.. కాల్ చేసిన వ్యక్తి నందు అని తెలుసుకొని గీతాకి ఇస్తాడు.
చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడుకున్న ఇద్దరు బయటకు వచ్చాక ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. కొద్దిసేపటి అమిత్కి కాల్ వచ్చింది. తన భార్య, పిల్లలతో ముచ్చటించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. మరో కంటెస్టెంట్ తనీష్ తన తల్లితో మాట్లాడుతూ చీవాట్లు తిన్నారు.
కన్నా అంటూ తనీష్ని ముద్దుగా పిలుస్తూ కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు అర్ధమవుతుంది. నాని అన్న చెప్పింది వినమని అన్నారు. నువ్ ఏంటో మాకు తెలుసు కాని ఒకరితో క్లోజ్గా ఉండడం నచ్చడం లేదు. ముఖ్యంగా ఫ్యాన్స్కి ఇది నచ్చడం లేదు. ఇలా ఉంటే ఓట్స్ పడవు. అందరితో బాగా ఉంటున్నావ్. కొంచెం కోపం తగ్గించుకో అంటూ తనీష్ తల్లి సలహాలు ఇచ్చారు.