తెలుగు ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటి ఇలియానా. ఆ తర్వాత పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ ఇలా అగ్ర హీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే ఈ అమ్మడు బాలీవుడ్ పయణం అయ్యింది. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు..అప్పటికే తెలుగు లో రకూల్, రెజీనా, రాశీఖన్నా ఇలా కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోయింది.
దాంతో తెలుగు లో పెద్దగా ఛాన్స్ లు రాకపోవడంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. కొంత కాలంగా ఇలియానా ఆస్ట్రేలియా ఫేమస్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో సహజీవనం చేస్తుంది. అయితే వీరికి పెళ్లి అయ్యిందని ఇలియానాకు ప్రెగ్నేన్సీ అని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ లేదని అది నిజమైతే బాగున్ను అని ఓ పోస్ట్ లో పెట్టింది. దాదాపు ఏనిమిది సంవత్సరాల తర్వాత రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో నటిస్తుంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించింది ఇల్లీ బేబి. తన పర్సనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా రిప్లై ఇచ్చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్లో నటిస్తున్నానని, చాలా హ్యాపీగా వుందని తెలిపింది. మనసున్న వ్యక్తి ఆండ్రూ నీబోన్ పిచ్చిగా ప్రేమిస్తున్నానని, అతడి రంగు, దేశంతో తనకు అవసరం లేదని బయటపెట్టింది. ఏది ఏమైనా తాను ఆండ్రూ నీబోన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.