తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు పెద్దగా పేరు తీసుకు రాలేక పోయాయి. తాజాగా నివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ‘సాక్ష్యం’ చిత్రంలో నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొన్నటి వరకు ‘సాక్ష్యం’ సెన్సార్ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని షాట్స్ ఉన్నాయి.
సెన్సార్ నిబంధనల ప్రకారం…చిత్రంల్లో వాటిని చూపించాలంటే కొన్ని ప్రత్యేక అనుమతులు రావాలి. అది లేకపోతే… సెన్సార్ చేయరు. చేసినా సర్టిఫికెట్ ఇవ్వరు. దాంతో ఈనెల 27న విడుదల కావాల్సిన సాక్ష్యం చిక్కుల్లో పడింది. దాంతో ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అవుతుందా..లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి “యూ/ఏ” సర్టిఫికెట్ ఇచ్చింది. పంచ భూతల “సాక్ష్యం” ఇచ్చే నేపధ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.
“అర్జున్ రెడ్డి” కి నేపధ్య సంగీతం అందించిన హర్ష వర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఐదుగురు ప్రముఖ గాయకులైన బాలసుబ్రమణ్యం, జేసుదాస్, బాంబే జయశ్రీ, హరిహారన్ , కైలాష్ ఖేర్ పాడిన పంచ భూతాల పాట ఈ చిత్రానికే ప్రధానం గా నిలవనున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.