తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా, నందమూరి,అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోలు తమ సత్తా చాటుతున్నారు. మంచు మోహన్ బాబు ఇద్దరు వారసులు హీరోలుగా స్థిరపడ్డారు. తాజాగా ఇదే బాటలో నడుస్తున్నాడు అర్జున్ రెడ్డితో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు చిత్రంతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’చిత్రంతో స్టార్ హీరోల సరసన చేరాడు.
తాజాగా ఈ హీరో తమ్ముడు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను . . పాత్రలను ఎంచుకుంటూ ఆయన దూసుకుపోతున్నాడు. త్వరలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ వినిపిస్తోంది.సురేశ్ బాబు .. మధుర శ్రీధర్ సంయుక్తంగా ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారట.
కేవీఆర్ మహేంద్ర అనే యువ దర్శకుడు చెప్పిన ఒక విభిన్నమైన కథ నచ్చడంతో, ఈ నిర్మాతలిద్దరూ ముందుకొచ్చినట్టు సమాచారం. కథా పరంగా ఈ చిత్రానికి కొత్త హీరో .. హీరోయిన్లతో చేస్తే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు, హీరోగా ఆనంద్ దేవరకొండను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ఈ చిత్రం పేరు దొరసాని' అనే టైటిల్ ను దర్శకుడు ఖరారు చేసుకున్నాడని చెబుతున్నారు. కథానాయిక ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తారట.