‘రంగస్థలం’ మూవీ భారీ సక్సస్స్ తరువాత తన నెక్ట్స్ సినిమా మహేష్ తో ఉంటుందని సుకుమార్ బహిరంగంగానే ప్రకటించాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో చేస్తున్న మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈసినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ఈ సినిమాను నిర్మించబోయే మైత్రి మూవీస్ కూడ లీకులు ఇచ్చింది. అయితే సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ మహేష్ కు నచ్చక పోవడంతో ఈప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండక పోవచ్చు అనే వార్తలు కూడ వచ్చాయి. 
Mahesh Babu and Sukumar
అయితే ఇప్పుడు కథ నచ్చక సమస్యలలో పడ్డ ఈకాంబినేషన్ మూవీకి రచియిత విజయేంద్ర ప్రసాద్ సహకారంతో సెట్ అయ్యేలా కనిపిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే సుకుమార్ విజయేంద్ర ప్రసాద్ సహకారాన్ని తీసుకోవడానికి అంగీకరించాలి అని అంటున్నారు. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో భారీ డీల్ కుదుర్చుకుంది అని వార్తలు వస్తున్నాయి. 
K.V. Vijayendra Prasad. Photo: Milind Shelte
తెలుస్తున్న సమాచారం మేరకు విజయేంద్ర ప్రసాద్ ఎరోస్ కు దాదాపు 10 కథలు ఇవ్వడానికి ఒక భారీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈకధలకు  సంబంధించి కొంతమంది దర్శకుల పేర్లు కూడ ప్రచారంలోకి వస్తున్నయి. దర్శకుడు సుకుమార్ ఒప్పుకుంటే ఎరోస్ సంస్థ వద్ద ఉన్న కధలలో ఒక కధను సుకుమార్ కు ఇవ్వడానికి ఈనిర్మాణ సంస్థ అదే విధంగా విజయేంద్ర ప్రసాద్ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

అయితే మైత్రీ మూవీస్ చేస్తున్న ఈ ప్రతిపాదనకు సుకుమార్ ఒప్పుకుంటాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం సుకుమార్ తన మొదటి సినిమా ‘ఆర్య’ నుండి నిన్నటి ‘రంగస్థలం’ వరకు ఇలా అన్ని సినిమాలకు కథలు సొంతంగా రాసుకునే అలవాటు సుకుమార్ కు ఉంది. బయట రచయితల కథల వల్ల తనకు అసౌకర్యంగా ఉంటుందని సుకుమార్ గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడ చెప్పాడు. అయితే కేవలం మహేష్ కోసం తన పద్ధతి మార్చుకుని రాజీ పడతాడా లేదంటే మహేష్ కు నచ్చే మరో కథను వ్రాసి ఇస్తాడా అన్న విషయం రానున్న రోజులలో తెలియనున్నది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: