తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే సమయంలో దర్శక, నిర్మాతల తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక తెలుగు లో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొంత పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ శ్రీనివాస్  తొలి చిత్రం అల్లుడు శీనుతో మంచి  మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు చిత్రం ఫ్లాప్ అయ్యింది.  వెంటనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జయ జానకీ నాయక’చిత్రంతో మరో విజయం అందుకోవడమే కాదు పక్కా కమర్షియల్ హీరో అనిపించుకున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్. ఈ క్రమంలో ‘సాక్ష్యం’ అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో నటించాడు. 

Image result for saakshyam movie

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు.  మొదటి నుండి నటన, డాన్స్ ల్లో మంచి పేరు సంపాదించిన సాయి శ్రీనివాస్, ప్రతి చిత్రంతో తన నటనలో పరిణితిని పెంచుకుంటూ వెళ్తున్నాడు అనే చెప్పాలి.  

Image result for saakshyam movie

తెలుగు రాష్ట్రాల్లో ‘సాక్ష్యం’ చిత్రం మొదటి షో పడలేదు. దానికి కారణం కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లం అంటున్నారు.  అయితే అయితే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.  ప్రీమియం షో వివరాల ప్రకారం..  సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ తో పాటు అద్భుతమైన   యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. 

Image result for saakshyam movie

ఇక ఇంట్రవెల్ బ్యాన్ అధిరిపోయిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ బిగినింగ్ లో ఇంటరెస్టింగ్ గా సాగినా మధ్యలో కొన్ని అనవసరపు సన్నివేశాలతో సాగదీసినట్లు అనిపిస్తుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్..క్లయిమాక్స్ సీన్లు అధిరిపోయేలా తీశారని అంటున్నారు. యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ని కోరుకునే వారికి బాగా నచ్చుతుందని అంటున్నారు.   మొత్తంగా చూస్తే సాక్ష్యం చిత్రం యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ మధ్య నిలిచే అవకాశం కనపడుతోందని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: