అడివి శేష్-శోభిత దూళిపాల జంటగా నటిస్తున్న మూవీ గూఢచారి. టీజర్‌తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కి సంబంధించి దాదాపు రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.  మొత్తం 116 రోజులలో 158 డిఫరెంట్ లొకేషన్‌లలో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ టిక్కా దర్శకుడు. ఈ సినిమాలో 2013 మిస్ ఇండియా అయిన శోభిత ధూళిపాళ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది.   ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే.. తన తండ్రి జవాన్ మాదిరిగానే దేశాన్ని కాపాడుకోవాలని భావిస్తాడు అడివి శేష్. దీనికోసం ఎంతకైనా సాహసించేందుకు ఇష్టపడతాడు.. గూఢచారిగా మారిపోతాడు. 


ఈ క్రమంలో గూఢచారిని పట్టుకోవాలని ఓ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెంటాడుతుంది.  ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తున్న ఎత్తులన్నింటిని చిత్తు చేస్తూ తన టార్గెట్ సాధిస్తుంటాడు. ఇంతకీ గూఢచారి చేసిన తప్పేంటి? ఆ టీమ్‌‌కి దొరికాడా?  అన్నదే సినిమా సారాంశం అన్నట్లు తెలుస్తుంది.   ఈ సినిమాలో  ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

Image result for గూఢచారి ట్రైలర్

యాక్షన్ స్పై థ్రిల్లర్‌‌గా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇవ్వబోతుందనే విషయం ట్రైలర్ చెప్పేస్తుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని దక్కించుకున్నారు. ఆయన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ అసోసియేషన్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శశికిరణ్ తిక్కా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్‌ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగమ్మాయి శోభితాతోపాటు మధుశాలిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: