ఈసమ్మర్ రేస్ కు వచ్చిన ‘భరత్ అనే నేను’ సాధించిన అనూహ్య విజయం కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ సినిమా కథ గురించి చర్చలు మన దేశ పార్లమెంట్ లో కూడ జరిగాయి అంటే ‘భరత్’ కథ దేశ ప్రజలకు ఏవిధంగా కనెక్ట్ అయిందో అర్ధం అవుతుంది.
ఈసినిమా ఘన విజయం తరువాత కొరటాల శివ చిరంజీవితో తీయబోయే తన తదుపరి సినిమా గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ‘భరత్’ సీక్వెల్ గురించి బాలీవుడ్ లో చర్చలు జరగడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
ఈ సీక్వెల్ కు సంబంధించి సైలెంట్ గా కథ రెడీ అవుతోంది అంటూ ప్రముఖ బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కి చెందిన ఒక బాలీవుడ్ వెబ్ సైట్ ప్రస్తుతం ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వాస్తవానికి ‘భరత్’ కథను కొరటాల దగ్గర ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ల బృందం వ్రాసింది అంటూ కొరటాల స్వయంగా చెప్పడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన ఫంక్షన్ లో ఈ కథను వ్రాసిన తన సహాయ దర్శకుల టీమ్ ను కొరటాల ఓపెన్ గానే పరిచయం చేసాడు.
అయితే ఇప్పుడు ఇదే టీమ్ ‘భరత్’ సీక్వెల్ కు కథ వ్రాస్తోందా లేదంటే మరెవ్వరైనా ప్రముఖ బాలీవుడ్ సినిమా రచయిత ‘భరత్’ కు సీక్వెల్ వ్రాస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఈ సీక్వెల్ వార్తలు నిజం అయితే కొరటాల ఈమూవీకి దర్శకత్వం వహిస్తాడా లేదంటే మరెవ్వరైనా బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడా మహేష్ పరిస్థితి ఏమిటి అంటూ అనేక సమాధానం లేని ప్రశ్నలకు తరణ్ ఆదర్శ్ లీకులు అనేక సందేహాలకు తావిస్తున్నాయి..