స్టార్ హీరోలు ఈమధ్య తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని తాము కలిసిన ప్రతి సందర్భంలో దిగిన ఫోటోల ద్వారా చెబుతూనే ఉన్నారు. రాం చరణ్, మహేష్.. మహేష్, ఎన్.టి.ఆర్.. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇలా వారంతా మంచి బాండింగ్ తో ఉన్నారు. ఇక ముగ్గురు కూడా ఈమధ్య తరచు కలుస్తున్నారు.


మహేష్, ఎన్.టి.ఆర్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మహేష్, ఎన్.టి.ఆర్ దగ్గ్రరకు చరణ్ వచ్చి జాయిన్ అయ్యాడు. అప్పుడు దిగిన పిక్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మళ్లీ ఈ ముగ్గురు దిగిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.   


నిన్న ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా ఏర్పరచిన స్పెషల్ డిన్నర్ లో మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిశారు. మళ్లీ ముగ్గురు ఎంతో జోష్ ఫుల్ గా కనిపించారు. చూస్తుంటే మంచి కథ దొరికితే ముగ్గురు కలిసి మల్టీస్టారర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ముగ్గురు హీరోలు ఇలా కలిసి చేస్తున్న హంగామా ఫ్యాన్స్ కు స్పెషల్ గా అనిపిస్తుంది. 


తమ హీరోలు లాగానే వారు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని చూస్తున్నారు. మరి అది సాధ్యమయ్యే పనేనా అన్నది చూడాలి. ఇప్పటికే చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి రాజమౌళి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ అక్టోబర్ లో మొదలవుతుండగా 2020 లో రిలీజ్ అవనుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: