ఈమధ్య బిగ్ బాస్ ఆడియెన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదటి నుండి ఎందుకో నీరసంగా సాగినట్టు అనిపించినా గత రెండు మూడు వారాలుగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక లాస్ట్ మండే యదావిధిగా నామినేషన్స్ అయితే జరిగినా ఈ వారం సడెన్ గా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని ఇంట్లోకి పంపించేలా ఓటింగ్ జరిగింది. 


ఇక అప్పటి నుండి బిగ్ బాస్ హౌజ్ లోకి సంజన, నూతన్, కిరీటి, భాను, తేజశ్విలలో ఎవరు వస్తారా అన్న ఎక్సైట్మెంట్ మొదలైంది. అయితే కిరీటి, సంజనా, భాను, తేజూలు ఆడియెన్స్ వివక్షతతోనే వెళ్లారు. కాని నూతన్, శ్యామలా కొద్దిరోజులు ఉండాల్సిన కంటెస్టంట్స్ అని అప్పట్లోనే అనుకున్నాం.


ఇప్పుడు అదే ప్రూవ్ అయ్యింది. రీ ఎంట్రీగా ఒకరిని కాదు ఇద్దరిని బిగ్ బాస్ హౌజ్ లోకి మళ్లీ తీసుకొచ్చారు. వారే నూతన్ నాయుడు, శ్యామలా. ఈసారి ఈ రీ ఎంట్రీకి 11 కోట్ల ఓటింగ్స్ జరిగాయని తెలుస్తుంది. నూతన్ కు కౌశల్ ఆర్మీ సపోర్ట్ ఉండగా.. శ్యామాలాకు సిని ప్రేక్షకులంతా ఓటేశారు.


నూతన్, శ్యామాలా ఈరోజు నుండి బిగ్ బాస్ హౌజ్ లోనే అయితే బిగ్ బాస్ చెప్పేదాకా ఇంట్లోకి వెళ్ల కూడదు అన్నది మరో ట్విస్ట్. అంటే లాస్ట్ సీజన్ లో ముమైత్ కు వేసిన శిక్షలా అన్నమాట. మొత్తానికి శ్యామలా, నూతన్ నాయుడులు బిగ్ బాస్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరచింది. కౌశల్ కు సపోర్ట్ గా నూతన్ ఈసారి ఫుల్ ప్రీపేర్డ్ గా వచ్చినట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: