బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’.   ఇప్పుడు తెలుగు శాటిలైట్ హక్కులు అయిదున్నర కోట్లకు అమ్మేసారు. జూలై 27న విడుదలైన ఈ చిత్రం బి సి సెంటర్ల లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంట్టున ఏ సెంటర్లలో మాత్రం మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది.  అయితే బెల్లంకొండ సురేష్ తనయుడు కావడంతో సినిమా ఖర్చు కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.  ఈ సినిమా  40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి శాటిలైట్ రూపంలో కలిసొచ్చింది.   


తెలుగు శాటిలైట్ హక్కులు రూ . 8కోట్లకు అమ్ముడవగా హిందీ శాటిలైట్ రూపంలో మరో 5కోట్లను ఖాతాలో వేసుకుంది.  ఇక మొత్తం శాటిలైట్ పరంగా 13 కోట్ల ను కలెక్ట్ చేసింది ఈచిత్రం.  ఓ యువ హీరో చిత్రానికి ఈస్థాయిలో శాటిలైట్ బిజినెస్ జరగడం అనేది ఇదే మొదటిసారి అని నిర్మాతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  పంఛభూతాలు అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిచారు. 

Image result for sakshyam movie

అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ ఈచిత్రాన్ని నిర్మించారు. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!



మరింత సమాచారం తెలుసుకోండి: